
కోరుట్ల, వెలుగు: తమ పిల్లలను ప్రభుత్వ బడికే పంపిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో ఆదివారం కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, లీడర్లు సమావేశమయ్యారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని, ప్రైవేట్ స్కూళ్లకు పంపించమని సామూహిక ప్రతిజ్ఞ చేశారు.